Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ మోటారు సైకిల్ యాత్ర
నవతెలంగాణ - అడ్డగుడూర్/ఆత్మకూర్ఎస్/నూతనకల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మందుల విప్లవ్కుమార్, కె.విజరు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల గ్రామాలను సందర్శించేందుకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్యాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ఎస్, నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా అడ్డగూడూరులోని కేఆర్ రెడ్డి, కాశం కృష్ణమూర్తి, బాలెంల నర్సయ్య, మరాఠీ సాయిలు స్థూపాలకు నివాళులర్పించారు. ఆత్మకూర్ ఎస్ మండలంలోని పాతసూర్యాపేట, ఎనుబాముల, ఏపూర్, పాతర్లపహాడ్, కోటపాడు గ్రామాల్లో అమరవీరుల కుటుంబాలను కలిశారు. నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని స్థూపాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న నాయకుల కుటుంబాలను కలిసి వారి సాదకబాధకాలు, ఆనాటి జ్ఞాపకాలను తెలుసుకుంటున్నామన్నారు. ఆనాటి పోరాట ఘట్టాలు, విశిష్టతల గురించి నేటి యువతకు వివరిస్తున్నట్టు చెప్పారు. అడ్డగూడూరులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు యాదగిరి ఆధ్వర్యంలో యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వళ్లంభట్ల శ్రీనివాస్రావు, డీవైఎఫ్ఐ నాయకులు ఎ.వెంకటేష్, నర్సింహారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు బుర్రు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.