Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ ప్రగతిభవన్ ముట్టడికి యత్నం
- ఎమ్మెల్యే సీతక్క, అన్వేష్ రెడ్డి అరెస్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలనీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ...కిసాన్ కాంగ్రెస్ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించింది.ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. మార్గ మధ్యలోనే ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కారం చేయకుండా సర్కారు అణచివేత చర్యల ద్వారా ప్రజల గొంతు నొక్కుతున్నదన్నారు.
పట్టభద్రుల అభ్యర్థిగా ప్రకటించాలన్న వీరయ్య
నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో సామాజిక న్యాయం పాటిస్తూ తనకే టికెట్ కేటాయించాలని టీపీసీసీ వికలాంగుల రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య కోరారు. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యాలయ ఇన్చార్జి కుమార్రావుకు ఆయన వినతిపత్రం సమర్పించారు.