Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల నోటిఫికేషన్(సీపీజెట్)ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం సీపీజెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని పాత జిల్లా కేంద్రాల్లో మొత్తం 46 సబ్జెక్ట్లలో ఈ ఏడాది పరీక్షలను నిర్వహించనున్నారు. వివిధ సబ్జెక్ట్లలో 30వేల సీట్లు ఉన్నాయనీ, అభ్యర్థులు www.tspgcet.com అనే వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది.