Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరవై రోజుల పాపకూ పాజిటివ్..
నవతెలంగాణ-వెల్దుర్తి
కరోనా వైరస్ విజంభిస్తున్న తరుణంలో ప్రతి మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ప్రైమరీ సెంటర్లో గురువారం 36 మందికి డాక్టర్ ప్రవళిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కుకునూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఇరవై రోజుల పాప ఉండడం గమనార్హం. దాంతో తల్లితో పాటు పాపను హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.