Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హెరిటేజ్ ఫుడ్స్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. నేటి కాలానికి అనుగుణంగా అల్లం, తులసి, పసుపు ఫ్లేవర్లల్లో పాలను తీసుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్లో హెరిటెజ్ పుడ్స్ చైర్మెన్ నారా భువనేశ్వరి, డైరెక్టర్ నారా బ్రాహ్మణి సంబంధిత ఉత్పత్తులను విడుదల చేశారు. శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థలతో పాటుగా థర్మో రెగ్యులేటరీ, థ్రోంబోటిక్ ప్రక్రియల కోసం అల్లం పాలు మేలు చేస్తాయని పేర్కొంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందనీ, వీటితో పాటుగా, శరీరంలో జీవక్రియలు మెరుగుపరిచేందుకు అల్లం తోడ్పడుతుందని నిరూపితమైందని పేర్కొంది. వేడి అల్లం పాలు కారణంగా గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గి గొంతు నొప్పి నుంచి ఉపశమనమూ కలుగుతుందని తెలిపింది. హెరిటేజ్ తులసి పాలలో తులసి గుణాలతో పాటుగా సబ్జా (స్వీట్ బాసిల్) విత్తనాలు, పుదీనా రసం ఉంటాయని, పాలలోని ఈ వనమూలికలు, చక్కటి రోగ నిరోధక వ్యవస్థను శరీరంలో పెంచేందుకు తోడ్పడతాయని తెలిపింది. వాతావరణ మార్పుల వేళ ఎదురయ్యే అనారోగ్యాల నుంచి కాపాడటంతో పాటుగా శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తులసి తోడ్పడుతుందని చెప్పింది. తులసితో పాటుగా సబ్జా గింజలను కూడా జోడించి అందించడం వల్ల మానవ శరీరానికి మంచిదని తెలిపింది. ఇది కూలెంట్గా తోడ్పడుతుంది. ఇక పసుపులో చక్కటి యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు ఉంటాయనీ, బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా ఎదురయ్యే పలు వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందని తెలిపింది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పసుపు కలిగి ఉంటుందని నిరూపితం కావడం వల్ల కచ్చితమైన రోగ నిరోధక శక్తి బూస్టర్గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. ఈ పాలను 90 రోజుల పాటు నిల్వ చేయవచ్చనీ, హెరిటేజ్ ఇమ్యూనిటీ మిల్స్ వేరియంట్స్లో ఎలాంటి కత్రిమ నిల్వ పదార్థాలూ ఉండవని తెలిపింది. ఇవి సుప్రసిద్ధ ఆధునిక రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, ఎంపిక చేసిన స్టాండలోన్ స్టోర్స్, ఎంపిక చేసిన హెరిటేజ్ ప్లార్లర్ల వద్ద 170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన పెట్ బాటిళ్ల రూపంలో దొరుకుతుందనీ, ఒక్కో బాటిల్ రూ. 30కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ ''ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరిస్తుండం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయి. వినియోగదారుల ఆరోగ్యం, సంతోషం కోసం అవసరమైన ఉత్పత్తులను ఆవిష్కరించడంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎల్లప్పుడూ ముందుంటుంది. సరైన సమయంలో సజనాత్మక ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా మాత్రమే దా నిని చేరుకోగలము. వినియోగదారుల అవసరాలను హెరిటేజ్ ఫుడ్స్ అర్ధం చేసుకుంటుంది. ఎన్నో విలువ ఆధారిత ఆరోగ్యవంతమైన ఉత్ప త్తులను వినియోగదారులకు తీసుకురావడంలో ముందుంటుంది'' అని అన్నారు.