Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయా లని తెలుగు మహిళా అధ్యక్షు రాలు తిరునగరి జ్యోత్స్న డిమాండ్ చేశారు. తెలంగా ణలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ తెలుగు మహిళా ఆధ్వర్యంలో ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జ్యోత్స్న మీడియాతో మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడిచినా మహిళా కమిషన్ లేకపోవటం అన్యాయమన్నారు. మహిళలపై సీఎం కేసీఆర్కు చిన్నచూపు తగదని హితవుపలికారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రభుత్వం మహిళ కమిషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ధర్నా చేస్తున్న పలువురు తెలుగు మహిళా నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఖండన మహిళల సమస్యలపై ట్యాంక్బండ్ వద్ద ధర్నా చేస్తున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్నతోపాటు పలువురు తెలుగు మహిళా నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి ఖండించారు. సమస్యలు పరిష్కరించకపోగా, కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా పోలీసులు దౌర్జన్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.