Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నిరసన
నవతెలంగాణ-యంత్రాంగం
రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి, పేదలకు ఉన్నత విద్యను దూరం చేయొద్దని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రయివేటు వాటికి అనుమతులివ్వడం సరికాదన్నారు. ప్రయివేటు యూనివర్సిటీలు వస్తే రిజర్వేషన్లు లేక, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం లేక నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు, ఆర్మూర్, సిరికొండలో నిరసన చేపట్టారు. రాష్ట్రవిద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని గుడిసెంటర్లో ధర్నా నిర్వహించారు. గార్ల మండలకేంద్రంలోని నెహ్రూ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.