Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు సర్కారు నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల పేర ఫీజుల్ని ఈవిద్యాసంవత్సరంలో పెంచొద్దని నిర్ణయం తీసు కున్నట్టు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తెలియ జేసింది. నెలవారీ ఫీజులు వసూళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు చెప్పింది. 2020-21 సంవత్స రంలో ఫీజులు పెంచరాదనీ, ఏప్రిల్ 21న జీవో 46 జారీ చేసినట్టు పాఠశాల ఫీజులపై విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన కౌంటర్ దాఖలు చేశారు. జీవో ప్రకారం బోధనారుసుం ప్రతినెలా వసూలు చేసుకోవాలనీ, ఒకేసారి లేదా మూడు లేదా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావద్దని చెప్పడం జరిగిందని కౌంటర్ లో పాల్గొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ చెప్పారు. ఆన్లైన్ తరగతుల పేరుతో అధిక ఫీజులు వసూళ్లు చేయడాన్ని అడ్డకోవాలంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజరుసేన్రెడ్డి డివిజన్ బెంచ్ విచారించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 పాఠశాలలపై ఫిర్యాదులు అందాయనీ, వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారని సంజీవ్కుమార్ తెలిపారు. షోకాజు నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయనీ, వీటిని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగమయ్యారని తెలిపారు. జూబ్లీహిల్స్ పబ్లిక్స్కూల్, బేగంపేట గీతాంజలి స్కూల్కు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.