Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇవే ఇండ్లు చూపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారనీ, ఈ ఎన్నికల్లోనూ అవే ఇండ్లు చూపించి లబ్ది పొందే ప్రయత్నం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఇందిరాభవన్లో హైదరాబాద్ నగర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. లక్ష ఇండ్లు చూపిస్తామన్నారు...చివరకు చూపించింది కేవలం 3428 ఇండ్లు మాత్రమేనన్నారు. గ్రేటర్లో కట్టాల్సిన 96వేల ఇండ్లగానూ కట్టింది 3428 ఇండ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్ ప్రజలకు అంటున్నారనీ, మరి స్థానికులకు ఎక్కడ ఇస్తారని ప్రశ్నించారు. తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే ఇండ్లు చూపెట్టి ఓట్లేసుకున్నారనీ, ఇప్పుడు అవే ఇండ్లను గ్రేటర్ వాసులకు ఇస్తామంటున్నారంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
జీవాల పెంపకందార్లకు అండ : మంత్రి తలసాని
రాష్ట్రంలోని జీవాల పెంపకందారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. శనివారం మాసాబ్ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రకాల ప్రమాదాలతో జీవాలు మరణించిన సందర్బాలలో పెంపకందారులు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్, విజయా డెయిరీ ఎండీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల విచారణ తొందరగా పూర్తి చేయండి
రాష్ట్రంలో నమోదవుతున్న అట్రాసిటీ కేసుల విచారణ తొందరగా పూర్తి చేసి నిర్ణిత సమయంలో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఐజీ పీసీఆర్, డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్స్తో కలిసి అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు.