Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్కు నోటీస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 26వేల మంది ఆశా వర్కర్లకు రూ 10వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలనీ, కరోనా ఇన్సెంటివ్ రూ 5వేలు ఇవ్వాలనీ, ఇతర వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28,29,30 తేదీల్లో సమ్మె చేస్తామని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ (సీఐటీయూ) ప్రకటించింది. ఈమేరకు శనివారం వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్కు యూనియన్ రాష్ట్రఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు పి జయలక్ష్మి, కె సునీత, కోశాధికారి సి లలిత నోటీస్ ఇచ్చారు.