Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో, పార్సిల్ సర్వీసుల్ని ప్రజలు వినియోగించుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారంనాడాయన సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ సేవల్ని ప్రజలతో పంచుకున్నారు. ప్రయాణీకుల రవాణాకు టీఎస్ఆర్టీసీ కట్టుబడి ఉన్నదనీ, కరోనా కాలంలో బస్సులు తిరగకపోవడం వల్ల సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కొంతలో కొంతైనా ఆ నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకే వస్తురవాణా సేవల్ని ప్రవేశపెట్టామని చెప్పారు.