Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 శాతం టీచర్లు, లెక్చరర్లు రాక
- ఆన్లైన్ పాఠాల నివృత్తికే క్లాసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యా ర్థులకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తరగతులు బోధించడం మాత్రంఉండవు. ఇప్పటికే జరుగుతున్న ఆన్లైన్ పాఠ్యాం శాల్లో ఏమైనా సందేహాలుంటేనే టీచర్లు, లెక్చరర్లు నివత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని స్కూళ్లు, కాలేజీల్లో సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు. కేంద్రం ప్రభుత్వం వెలువరించిన అన్లాక్-4 మార్గదర్శకాల ప్రకారం విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఆన్లైన్ తరగతులు కొన సాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. శనివారం ఆయా జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో టీచర్ల సందే హాలను డీఈవోలు నివత్తి చేశారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజ రయ్యేందుకు కూడా విద్యాశాఖ గ్రీన్సిగల్ ఇచ్చింది. ఇది ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల నిర్వహణపై ఆధా రపడి ఉంటుంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 20 రోజులు పూర్తయింది. పాఠాల వారీగా వర్క్షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. అన్లాక్-4 సడలింపుల్లో భాగంగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయులు, లెక్చరర్ల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లవచ్చని కేంద్రం ఇప్పటికే తెలియజేసింది.