Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మౌంటేన్ డ్యూ ట్రేడ్ మార్కు కోసం జరిగిన న్యాయపోరులో పెప్సికో కంపెనీకి చుక్కెదురైంది. ఈ మేరకు మంగళవారం మ్యాగ్ ఫాస్ట్ బేవరేజెస్ కంపెనీ యజ మాని సయ్యద్ ఘజియుద్దీన్, న్యాయ సలహాదారు మీర్ ఫిరాసత్ అలీ షుతారీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మౌంటేన్ డ్యూ ట్రేడ్ మార్కు తమకు చెంది నది కాగా దానిని పెప్సికో ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించగా రాష్ట్ర హైకోర్టు లో న్యాయం దక్కిందని తెలిపారు. 2000 సంవత్సరంలో తాము మార్కెట్లోకి మౌంటేన్ డ్యూ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ను తేగా పెప్సికో మూడేండ్ల తర్వాత 2003లో వచ్చిందన్నారు. రెండు ఉత్పత్తులు వేర్వేరని వివరించారు.