Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగ భధ్రత కోసం ఆశా వర్కర్లు బతుకు పోరాటం చేస్తున్నారు. ఎండనక, వాననక రాత్రి, పగలు కష్టపడి పని చేసినా నెలాఖరు వరకు ఎంతొస్తదో తెలియని ఆయోమయ పరిస్థితి వారిది. ప్రభుత్వ రంగమైనా, ప్రయివేటు రంగమైనా ప్రతి ఉద్యోగికి ప్రతి నెలా జీతం ఇంత అని లెక్క ఉంటుంది. కాని ఆశా వర్కర్లకు అలాటిందేమి లేదు. వారు చేసే కుటుంబ నియత్రణ కేసులు, ఇతరత్రా ఎంత పని చేస్తే దాన్ని బట్టే ఆ నెల జీతం నిర్ణయం జరుగుతుంది. 2015 సెప్టెంబర్ 2 నుంచి డిసెంబర్ వరకు 106 రోజుల పాటు ఆశాలు ఉధృతమైన పోరాటం చేశారు. ఏండ్లుగా ఆశాలు చేస్తున్న ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో వారికి కేసులతో సంబంధం లేకుండా టంఛనుగా ప్రతి నెలా రూ.6,000 చెల్లిస్తామని ఇచ్చిన హమీ ఇప్పటికి అమలు కాలేదు. సీఎం హమీతో పాటు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28,29,30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఈనెల 19న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్కు తెలంగాణ వాలంటరీ,కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, కె.సునీత సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ పోరాటం విజయవంతానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దీక్షలను చేపట్టారు.
ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి: కె. సునీత
ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు రాష్ట్రంలోనూ ఆశాలకు 10వేలు ఫిక్స్డ్ వేత నం చెల్లించాలి. కరోనా ఇన్సెంటివ్ను రూ.5,000 పెంచాలి. ప్రమాదక రమె ౖన పరిస్థితుల్లో కరోనా విధులు నిర్వహిస్తున్నందున నాణ్యమైన మాస్కు లు, శాని టైజర్లు, పీపీఈ కీట్లు అందించాలి. జాబ్చార్ట్ ఇవ్వడంతో పాటు సెలవు లు ప్రకటించాలి. ఉద్యోగ భద్రత కల్పించి,పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిం చాలి. కరోనా సోకినా విధులతో సంబంధం లేకుండా జీతం ఇవ్వాలి. ప్రభు త్వం ప్రకటించినట్టు మరణించిన వారికి రూ. 50 లక్షల బీమా చెల్లించాలి.