Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఆమో దించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు లు, ప్రజలు చేస్తున్న ఆందోళ నలను పక్కదారి పట్టించడా నికే కేంద్ర ప్రభుత్వం ఆరు రబీ పంటలకు మద్దతు ధరలు పెంచిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శాస్త్రీయంగా ఉత్పత్తి ధరను బట్టి లెక్కకట్టి స్వామినాథన్ ఫార్ములా ప్రకారం 50శాతం అదనంగా చేర్చి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కనీస మద్దతు ధరలు 23 పంటలకు బదులు గా రబీ పంటలకే ప్రకటించి రైతులను మోసం చేసిందని తెలి పారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు చట్టాలు రైతుల కు తీవ్రనష్టం చేస్తాయనీ, అవి కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు పెద్దఎత్తున జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతుల ఉద్యమాన్ని చల్లబర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతంలోని ఆరు రబీ పంటలైన గోధుమ, ఎర్రపప్పు, శనగ, బార్లీ, కుసుమ, ఆవ పంటలకు కంటితుడుపుగా కనీస మద్దతు ధరలు పెంచిందని వివరించారు. జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధికంగా పండే పంటల్లో రెండో స్థానంలో ఉన్న వరిని విస్మరించడాన్ని తప్పుబట్టారు. మిరప, ఉల్లి, ఆముదం తదితర పంటలకు మద్దతు ధరలు లేని విషయాన్ని ఎత్తిచూపారు. అశాస్త్రీయంగా ధరలు ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం రైతులను మోసగిస్తున్నదని విమర్శించారు. ధరల ప్రకటన మతలబును రైతులు అర్ధం చేసుకొని చట్టాల ఉపసంహరణకు జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. రైతాంగ ఉద్యమాలకు సీపీఐ(ఎం) మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు.