Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని పనులున్నారద్దు చేసుకోండి..
- వార్డుల వారీగా తిరగండి... :మంత్రులు, మేయర్లు, మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు సీఎం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్ని పనులున్నా రద్దు చేసుకుని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్లతోపాటు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ మంత్రులు, మేయర్లు, మున్సిపల్ ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఇందుకోసం అధికారు లతో కలిసి వార్డుల వారీగా తిరుగతూ వివరాలను సేకరిం చాలని సూచించారు. భూములు, ఆస్తులకు సంబంధించిన సూక్ష్మ సమాచారాన్ని సైతం అప్డేట్ చేయాలని కోరారు. ఇందుకోసం 24 గంటలూ శ్రమించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం దార్శనిక తతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు నేపథ్యంలో ఏ ఒక్క నిరుపేదకూ అన్యాయం జరక్కూడదని తెలిపారు. చివరి గుడిసె వరకూ వాటి ఫలితాలు అందేలా చూడాలని కోరారు. నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జీహెచ్ఎమ్సీతోపాటు వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్టీల పరిధిలోని ప్రజా ప్రతినిధులతో... సీఎం భేటీ అయ్యారు. మంత్రులు, పలువురు ఉన్నతాధికారు లు కూడా సమావేశానికి హాజరయ్యారు. భూములను క్రమబద్దీకరిం చడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేలోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించాలని సూచించారు. వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.