Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోయినపల్లి వినోద్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత ఆరున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని నీటి పారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీస్ (సీఐఐ) ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో 'నీటి సంరక్షణ, సుస్థిరమైన పరిష్కారాలు...' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రంగాల్లోనూ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అనేకాంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.