Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకు అవకాశమివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్... అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. ఆ నియోజకవర్గంలో బీసీల జనాభా 64 శాతంగా ఉందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అన్ని ఎన్నికల్లోనూ బీసీలకు సీట్లివ్వకుండా రాజకీయ పార్టీలు వారిని అవమానిస్తున్నాయని తెలిపారు. బహుజనుల సమస్యలను పరిష్కరించని అధికార పార్టీకి.. ఓటడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.