Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హేమంత్ హత్యకు కారకుడయిన లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కేవీపీఎస్) డిమాండ్ చేసింది. ఈమేరకు ఆసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగళ్ళ భాస్కర్, టి. స్కైలాబ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు జీర్ణించుకోలేని యువతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి హాంతకులతో అత్యంత కిరాతకంగా హత్య గావించారని ఆరోపించారు. గతంలో జరిగిన ప్రణరు హత్య మాదిరి గానే హేమంత్ హత్య జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రం లో46 కుల దూరహంకార హత్యలు జరిగాయని గుర్తు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం, అగ్రకుల ఆధిపత్యం, అధికార పార్టీ అండదండలతో ఈ దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.