Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీవోకు తెలియకుండా అక్రమంగా 30 ఎకరాలకు పాస్బుక్కులు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అవినీతి తిమింగలం కీసర మాజీ ఎమ్మార్వో అవినీతిని తవ్విన కొద్దీ కొత్త అక్రమాలు తేలుతున్నాయి. ఏసీబీ అధికారు లు తాజాగా నాగరాజు కీసర మండలం రాంపల్లి గ్రామంలో కందాడ ధర్మారెడ్డి అతని కుటుంబసభ్యులకు దాదాపు 30 ఎకరా లకు సంబంధించిన కొత్త పాస్బుక్కులను జారీ చేశాడు. దీనికి సంబంధించిన అప్పీలు వివాదం ఆర్డీవో ముందు ఉండగానేపై అధకారికి తెలియకుండా నాగరాజు ఈచర్యకు పాల్పడినట్టు ఏసీబీ జరిపిన విచారణలో వెల్లడైంది.ఈ భూముల విలువ రిజిస్ట్రేషన్ అధికారి వేసిన అంచనా ప్రకారం 2.68 కోట్లు కాగా దాని ప్రస్తుత మార్కెట్ విలువ 48.98 కోట్లుగా తేల్చారు. నాగ రాజు జరిపిన అక్రమ చర్యపై విచారణ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు ఏసీబీ తాజాగా దర్యాప్తు జరిపింది. అంతేగాక దీనికి సంబంధించి నాగరాజు ఇల్లు , ఇతర ప్రాంతాలో ఏసీబీ సదాలు కూడా నిర్వహించింది. ఈ మేరకు నాగరాజుపై కొత్తగా మరో కేసును అవినీతి నిరోధక చట్టం క్రింద నమోదు చేశారు. ఇటీవలే కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నదని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు.