Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్త తమను కలిచి వేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఆయన మృతి చెందారని తెలిసాక తాము దిగ్భ్రాంతికి గురైనట్టు పేర్కొన్నారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఉన్నత ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. లక్షలాది మంది సంగీత ప్రియులను తన గానంతో అలరించారని గుర్తు చేశారు. దశాబ్ధాలుగా సంగీత ప్రపంచానికి, సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్రెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలి పారు. బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర సమాచార కమిషనర్, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్కుమార్ సంతాపం తెలిపారు.
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతికి
తమ్మినేని సంతాపం
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తెలుగురాష్ట్రాల ప్రజలకేకాకుండా సినీపరిశ్రమకు తీరనిలోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నాలుగు దశాబ్ధాలపాటు తెలుగుచిత్ర సీమకు, భారతీయ సినిమాలకు అద్బుత పాటలుఅందించారని తెలిపారు. ఆయనకు కుటుంబసభ్యులు సానుభూతి తెలిపారు. ఎస్సీబాల సుబ్రహ్మణ్యం మృతికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సంతాపం ప్రకటించారు.