Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోన వైరస్ ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ప్రభుత్వాలకు సైతం ఆరోగ్యం విషయంలో మన స్థాయి ఏంటో తెలియజేసిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వాలు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా చేసిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్ని వేల కోట్లయినా సరే ఖర్చుచేసి ప్రజలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్యమందించేలా పరికరాలు, మౌలిక సవసతులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో సకల సౌకర్యాలు అందు బాటులోకి తీసుకువస్తున్నా మని ప్రకటించారు. నిమ్స్ ఆస్పత్రిలో మాలిక్యూలర్ ల్యాబ్ను శుక్రవారం మంత్రి ఈటల ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తు న్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి మంత్రి అభి నందనలు తెలిపారు. నిమ్స్ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ అని, ఇక్కడ మూత్రపిం డాలు, లివర్, గుండెమార్పిడి చేయడానికి పరీక్షలు అవసరమవుతాయనీ, వాటిని చేయడానికి 6 కోట్లతో మాలిక్యూలర్ డయాగస్టిక్ సెంటర్ను ప్రారంభించి నట్టు తెలిపారు. దీంతో కిడ్నీ, లివర్, హార్ట్, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవసరమైన పరీక్షలన్నీ ఈ ల్యాబ్లో చేయడానికి వీలవుతుందన్నారు. వీటితోపాటు కరోనా పరీక్షలు చేయడానికి దక్షణభారత దేశంలో మొదటి సారిగా ఏర్పాటుచేసిన కోబాస్ మిషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజుకు నాలుగు వేల కరోనా పరీక్షలు చేయగల సామర్ధ్యం ఇక్కడ ఉందన్నారు.