Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నాయకులు సింగిరెడ్డి మురళిధర్ రెడ్డి ఆధ్వర్యంలో చెందిన వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని తెలిపారు. పార్టీ బలోపేతానికి, పేదలకు సేవ చేసేందుకు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే అంకురార్పణ అని తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్కుమార్ గౌడ్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.