Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నీ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలనిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులందరూ ప్రధానకేంద్రాల్లో ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన చర్య లు తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాల్లో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సీఎస్ పేర్కొన్నారు. లోతట్టు ప్రదే శాలు, వరద ముంపునకు గురయ్య ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎస్ సూచించారు.