Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
కులాంతర వివాహం చేసుకున్నందుకు దారుణ హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు శనివారం హైదరాబాద్లోని చందానగర్ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. అంత్యక్రియలకు అతని తమ్ముడు సుమంత్ యూకే నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. తన అన్నను కిరాతంగా హత్య చేశారని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. రెండ్రోజుల కిందటే అన్నయ్య తనకు ఫోన్ చేశాడని, బిజినెస్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలిపాడు. తన భర్తను చంపిన ఎవరినీ వదలనని అవంతి హెచ్చరించింది. తన కుమారుడికి కంటే ముందు తనను పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోగా బంధువులు అడ్డుకుని ఓదార్చారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: సుమంత్
తన అన్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. తమ కుటుంబానికి నిత్యం బెదిరింపు ఫోన్లు వచ్చేవి. మా అన్నను చిత్రహింసలకు గురిచేసి చంపారు. హేమంత్ను కిడ్నాప్ చేసే సమయంలో నాకు ఫోన్ వచ్చింది. కారులో ఎక్కించుకుని చిత్రహిం సలు పెడుతూ తీసుకెళ్లారు. మొహంపై అన్నీ దెబ్బలే ఉన్నాయి. హత్యకు అవంతి తల్లిదండ్రులు, మామ ప్లాన్ వేసి మిగతవారికి చెప్పారు. మాలా మరో కుటుంబానికి అన్యాయం జరగొద్దు.