Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్ కమిటీతో భేటీ
- టీమ్వర్క్తోనే ఎన్నికల్లో విజయం : ఠాగూర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్చార్జి మాణికం ఠాగూరు హైదరాబాద్కు చేరుకు న్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీపీసీసీ కోర్ కమిటీతో ఆయన సమావేశమై...తాజా రాజకీయ పరిస్థితులు, కార్పొరేషన్ల ఎన్నికలు, దుబ్బాక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సూత్రప్రాయంగా చర్చించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కె జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కష్ణన్, సంపత్ కుమార్, వంశీ చంద్రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్కుమార్యాదవ్, అధికార ప్రతినిధి కృష్ణతేజ తదితరులు స్వాగతం పలికారు. కోర్ కమిటీ అనంతరం మాణికం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని హితవు పలికారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేయడం ద్వారానే ప్రజలకు దగ్గరవుతామన్నారు. ప్రతి నెలలో రెండు సార్లు తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడాలనీ, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు.
'రకుల్ ప్రీత్ సింగ్ ను కాపాడేందుకు ప్రయత్నం'
ముంబయి డ్రగ్స్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆరోపించారు. రకుల్ ప్రీత్ సింగ్ కేంద్ర ప్రభుత్వ పథకమైన 'భేటీ పడవో భేటీ బచావో' పథకానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసి డర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. గతంలో హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారనీ, వారిపై రోజుల తరబడి విచారణ జరిపి తర్వాత ఎలాంటి చర్యలు లేకుండానే కేసు మూసేశారన్నారు.