Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంత బంగారం కొంటే.. అంత వెండి ఫ్రీ
- 10 వరకూ వినియోగదారులకు ప్రారంభోత్సకానుక : నిర్వాహకులు
ఖమ్మం : దేశంలో అతి పెద్ద బంగారు, వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన 13వ షోరూమ్ను తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో శనివారం ప్రారంభించింది. మలబార్ గ్రూప్ చైర్మెన్ ఎం.పి. అహ్మద్, ఇండియన్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ అషర్ సమక్షంలో మలబార్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ నటి తమన్నా బాటియా ఈ షోరూమ్ను ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యాంలాల్ అహ్మద్, మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలాం కెపి, ఇతర మేనేజ్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మలబార్ గోల్డ్ & డైమండ్స్ అధికారిక పేస్బుక్ పేజిలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు నుండే జరిపిన ప్రత్యేక ప్రివ్యూ అమ్మకాలకు ఆభరణాల ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన లభించినట్టు షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ప్రారంభోత్సవ కానుకగా కొనుగోలుచేసిన బంగారం బరువుకు సమానమైన వెండిని ఉచితంగా వినియోగదారులు అందించనున్నారు. ఈ ఆఫర్ అక్టోబరు 10 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా వినియోగదారుల సంరక్షణకు దృష్టిలో పెట్టుకొని అవసరమైన అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలు పాటిస్తూ షోరూమ్ను పరిశుభ్రమైన వాతావరణంతో నడుపుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.