Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో ప్రయివేటు ఆస్పత్రి నిర్వాకం
- చితిపై పెట్టాక గుర్తింపు
నవతెలంగాణ-డిచ్పల్లి/భిక్కనూర్
కరోనాతో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలు తారుమార య్యాయి. హైదరాబాదులోని ఓప్రయివేటు ఆస్పత్రి నిర్వాకం తో జరిగిన ఈ ఘటనలో అంత్యక్రియల చివరి నిమిషంలో కుటుంబీకులు గుర్తించారు. వివరాలిలాఉన్నాయి.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన
ఒకరు, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి వ్యక్తి కోవిడ్ బారిన పడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతిచెందారు. కానీ, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతదేహాలు తారుమారయ్యాయి. తొలుత ఇందల్వాయి మండలానికి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, కోవిడ్తో చనిపో వడం వల్ల చివరి వరకు ఎవరినీ మృతదేహం దగ్గరకు వెళ్లనివ్వలేదు. అంబులె న్స్లో తీసుకొచ్చి డైరెక్టుగా అంత్యక్రియల వద్దకు తీసుకెళ్లారు. కట్టెలపై మృత దేహాన్ని పెట్టాక ఇద్దరు కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు దగ్గరికెళ్లి అది వేరొకరి మృతదేహంగా గుర్తించారు. అదే సమయంలో మృతదేహాలు తారుమా రైనట్టు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ రావడంతో అంత్యక్రియలు ఆపేశారు. దీంతో భిక్కనూర్ నుంచి మరో మృతదేహాన్ని ఇందల్వాయికి, ఇక్కడి నుంచి మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.