Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 16 గేట్లను మంగళవారం అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాలకు లక్ష 27 వేల 1900 క్యూసెక్కుల నీరు వస్తోంది. దాంతో 16 గేట్ల ద్వారా లక్ష 5,477 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు అదే తరుణంలో ఐదు యూనిట్ల ద్వారా 28500 క్యూసెక్కుల నీరు జల విద్యుత్ కేంద్రానికి వదులుతున్నారు ఎడమ కాలువకు 900 క్యూసెక్కులు, కుడికాలువకు 550 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 199 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూరాల జలాశయం నుంచి మొత్తం లక్ష 36 వేల326 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్టు పీజీపీ అధికారులు తెలిపారు.