Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్యలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలం : సీపీ సజ్జనార్
- పోలీసు కస్టడీకి ఇద్దరు నిందితులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో ఎవరినీ వదలబోమని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. హైదరాబాద్లోని కమిషరేట్లో ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో ఆయన హేమంత్ కేసుపై మాట్లాడారు. ఈ కేసుతో సంబంధంఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్రెడ్డిలను 6రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చిం దని చెప్పారు. వారిని విచారించిన అనంతరం హత్యకేసుతో సంబంధం ఉన్న అందరినీ అరెస్టుచేస్తామని తెలిపారు. హేమంత్ కుటుంబ సభ్యు లకు ప్రాణభయం ఉన్నట్టు తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు. మరోవైపు గచ్చిబౌలి పోలీసులు అవంతి కుటుంబసభ్యులను విచారిస్తు న్నారు. మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించగా, ఇప్పటికే 14 మంది జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. అవంతితోపాటు హేమంత్ సోదరుడు, తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్కు వెళ్లారు. వారి స్టేట్మెంట్లను కూడా పోలీసులు రికార్డు చేశారు.