Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదు
- గ్రేటర్ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
- సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంగళవారం ఆయన సమావేశమ య్యారు. 15శాతం మంది కార్పొరేటర్ల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేండ్లలో హైద రాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిం దన్నారు. తాగునీటి ఇబ్బందులు తొలగించి, రోడ్లను అభివృద్ధిపరచి, రూ.లక్షల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఐదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.67వేల కోట్లతో హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను, మౌలిక వసతులకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్నీ ఒకచోట చేకూర్చి 'ప్రగతి నివేదిక' విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు సూచించారు. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తు ల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమా చారాన్ని తీసుకెళ్లాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. నగరంలో అనేక కారణాలతో రిజిస్ట్రేషన్లు, ప్రజల ఆస్తులపై సంపూర్ణ హక్కులు లేకుండా సమ స్యలు ఉన్నాయని, వీటన్నింటినీ సానుకూలంగా పరి శీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న దనిచెప్పారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు తీసుకొచ్చారన్నారు. స్థిరాస్తులపైనా యాజమాన్యహక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుంద న్నారు. ఇలాంటి ప్రక్రి యలో దళారులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లకు సూచిం చారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని సూచించారు. నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు.