Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు పెరుగుతున్నాయని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై పెరుగుతున్న హింసను ఆరికట్టాలని డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగల్ల భాస్కర్, స్కైలాబ్బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. మనీషా వాల్మీ 19 అనే ఏండ్ల యువతిపై అత్యాచారం జరిగి, ప్రాణాలతో బయటపడినా తీవ్రమైన గాయాలపాలై 2020 సెప్టెంబర్ 29న మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేశారని తెలిపారు.