Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లు
- 10,032 మంది వెబ్ఆప్షన్లు నమోదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,116 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫార్మసీ కోర్సులో 3,882 సీట్లున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ కలిపి మొత్తం 72,998 సీట్లు ఉన్నాయని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో అత్యధికంగా 16,681 సీట్లున్నాయని తెలిపారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ)లో 1,806 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటాసైన్స్)లో 3,213 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్)లో 5,310 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (నెట్వర్క్స్)లో 126 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఐవోటీ)లో 1,281 సీట్లు కంప్యూటర్ ఇంజినీరింగ్ (సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్)లో 210 సీట్లున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో 13,397 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ)లో 6,907 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్లో 6,378 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ)లో 5,980 సీట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో 4,650 సీట్ల చొప్పున 45 బ్రాంచ్ల్లో కలిపి 69,116 సీట్లున్నాయని వివరించారు.
బీ ఫార్మసీలో 3,352 సీట్లు, ఫార్మ్-డీలో 530 సీట్ల చొప్పున 3,882 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఇప్పటి వరకు 51,880 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 57,530 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఈనెల 19 వరకు అవకాశముందని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 20 వరకు జరుగుతుందని వివరించారు. 10,032 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని పేర్కొన్నారు. ఓ అభ్యర్థి అత్యధికంగా 629 ఆప్షన్లు నమోదు చేశారని తెలిపారు. వెబ్ఆప్షన్ల నమోదుకు ఈనెల 22 వరకు అవకాశముందని వెల్లడించారు. అభ్యర్థులు ఎక్కువ వెబ్ఆప్షన్లు నమోదు చేసి సీట్లు పొందాలని కోరారు.