Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ రోహిత్సింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన కరెంటు స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. తడిచిన పత్తి, వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డబ్బికార్ మల్లేశ్, నూకల జగదీశ్చంద్ర, డాక్టర్ మల్లు గౌతమ్రెడ్డి, రవినాయక్, వేములపల్లి వైస్ ఎంపీపీ పాల్వాయి గోవర్థని శశిధర్రెడ్డి పాల్గొన్నారు.