Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజాం నవాబును పొగిడే వాళ్లు ఆయన ప్రణాళికను గౌరవించి అమలు చేయరా?అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. ఏడో నిజాం ఆసిఫ్జాహీ పట్టణాభివృద్ధి బోర్డును 1912లో ఏర్పాటు చేశారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరాభివృద్ధి కోసం ఆనాటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు 1926లో నగరంలో డ్రైనేజీ బోర్డును ఏర్పాటు చేశారని వివరించారు. వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల నుంచి ప్రవహించే ప్రవాహాన్ని ఇబ్రహీంపట్నం చెరువుకు వదిలే విధంగా ప్రణాళిక ఫిరంగి నల్లాలను రూపకల్పన చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇండ్లు కూలితే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50 వేలు, వరద నీరు ఇండ్లలోకి వస్తే కుటుంబానికి రూ.10 వేలు మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తుంటే హైదరాబాద్ వారికే ఎందుకు పరిహారం ప్రకటించారని ప్రశ్నించారు. వారికేది సాయం, ఓట్ల అవసరం అక్కడ లేదు, నగరంలోనే ఉంది కాబట్టి ఇక్కడే ఇస్తున్నారా?అని అడిగారు. ఫిరంగినాలాలపై నిపుణుల కమిటీ వేయాలనీ, నిజాం పథకాలను అమలు చేయాలని కోరారు. దురాక్రమణలపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యంగా కేంద్రాన్ని కోరాలని తెలిపారు.