Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదనీ, తమ అభ్యర్థి ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుం టున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గెలుస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావు...బీజేపీ నేత ప్రచారంలో కరెంట్, మైకులు ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దుబ్బాకలో పనులు చేయకముందే రూ.3 కోట్ల నిధులు కాజేసిన మాట వాస్తవం కాదా? రోడ్డు వేయకముందే కాంట్రాక్టర్ రూ.1.25 కోట్లు స్వాహా చేసింది నిజం కాదా? అని హరీశ్రావును ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు.