Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ సర్వే నెంబర్ 114లోని ప్రభుత్వానికి చెందిన భూమి, పాఠశాల, రోడ్డులను ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలు చెప్పాలనీ, అదేవిధంగా పిటిషనర్ చెబుతున్న నిర్మాణాలకు ఏవిధంగా అనుమతులు ఇచ్చారో తెలియజేయాలని కూడా కోరింది. అధికారులకు ఫిర్యాదు చేసినా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదని మొఘల్పురాకు చెందిన ఆఫ్రీన్ బేగం పిల్ వేశారు. ప్రతివాదులైన రెవెన్యూ, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, నిర్మల్ జిల్లా కలెక్టర్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.