Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల తనిఖీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది.ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ మంగళవారం జీ.వో.నెం.439 విడుదల చేశారు. ఈ కమిటీ ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రత్యేక కోవిడ్-19 ఆస్పత్రుల తనిఖీ, పర్యవేక్షణ, సూచనల కోసం పని చేయనున్నది. కోవిడ్్ ఆస్పత్రుల రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్ చైర్పర్సన్గా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్.సునీల్ కుమార్, డాక్టర్ ఎ.విశాల్, ప్రొఫెసర్లు డాక్టర్ ఎస్.పావనీ, డాక్టర్ ఆర్.ఎల్.లక్ష్మణ్రావు, నీలోఫర్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.వీ.ఎస్.రవి నాగప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.