Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జులై 1న రావాల్సిన ఒక విడత కరువు భత్యం (డిఏ) విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 33.53 శాతం డిఏను 38.77 శాతానికి పెంచింది. మూల వేతనంపై పెరిగిన డీఏ 2019 జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ జీవో నెంబర్ 69, 70 వేర్వేరుగా విడుదల చేసింది. డిఏ బకా యిలు పెన్షనర్లకు కూడా వర్తిస్తాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు జీవో నెంబర్ 70లో పేర్కొన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ తనను కలిసిన ఉద్యోగసంఘాల నేతలతో డిఏ బకాయిల గురించి చర్చించిన విషయం తెలిసిందే.