Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బృందానికి బాధితుల ఆవేదన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజూ కేంద్ర బృందం పర్యటించింది. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్ల్లో పర్యటించి, వరద
ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బృందం వెంట ఉన్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఉపేందర్రెడ్డి, ప్రావీణ్య, చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్.. ఆయా ప్రాంతాలలో నెలకొన్న వరద పరిస్థితి, ప్రభుత్వపరంగా చేపట్టిన సహాయ, పునరావాస, పునరుద్ధరణ పనుల గురించి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలు ఇంకా ఉదతంగా ప్రవహిస్తున్నందున, చెరువుల పటిష్టతకు, నాలాల విస్తరణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులు వివరించారు. 7-11 అడుగుల వరకు మొదటి అంతస్తులు కూడా ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయినట్టు టోలిచౌకిలోని విరాసత్నగర్, బాల్రెడ్డి నగర్, నదీమ్ కాలనీ వాసులు తెలిపారు.