Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయపెడుతున్న వరుస పండుగలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొవిడ్-19 పాజిటివ్ రేటు రాష్ట్రవ్యాప్తంగా పడిపోయింది. దాదాపు గత నెల రోజులుగా నాలుగుశాతం లోపే వైరస్ బయటపడుతుండడం ఊరట కలిగిస్తున్నది. మరో రెండు, మూడు నెలల్లో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి తదితర పండుగలు వస్తుండడంతో కరోనా రెండవ దశ వ్యాప్తి ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదనీ నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనా నియంత్రణలో ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకున్న కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో పండుగల సమయంలో అప్రమత్తత అవసరమని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఏమి కాదనే భ్రమతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.