Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు విశ్వాసాన్ని ఇచ్చాం: అదనపు డీజీ స్వాతి లక్రా
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో షీటీమ్స్ను ఏర్పాటు చేశాక మహిళలకు సంబంధించిన 20 వేల కేసులను పరిష్కరించామని గత ఏడేండ్లలో షీటీమ్స్ పట్ల మహిళల్లో విశ్వాసాన్ని పాదుకొలిపామని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా అన్నారు. షీటీమ్స్ను ప్రారంభించి ఏడేండ్లు గడిచిందన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఓపికతో పరిశీలించి బాధితులకు న్యాయం చేకూర్చడంలో సక్సెస్ అయ్యామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా 3180 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేసి దర్యాప్తులను దాదాపుగా పూర్తి చేశామని ఆమె అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత మహిళలే గాక గ్రామ ప్రాంత స్త్రీల రక్షణ పట్ల షీటీమ్స్ ప్రత్యేక శ్రద్దను వహించిందని అన్నారు.