Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బృందానికి రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలకు ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, తక్షణ సాయం కింద రూ 2వేల కోట్లు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈమేరకు శనివారం కేంద్ర ప్రకృతి, వైపరీత్య పరిశీలన బృందానికి ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెసరకాయల జంగారెడ్డి, తీగల సాగర్, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్శోభన్ వినతిపత్రం సమర్పించారు. మొత్తం నష్టం అంచనా వేసి జరిగిన నష్టాన్ని పునరుద్దరణకు అయ్యే మొత్తాన్ని త్వరలో కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వరదలలో చనిపోయిన కుటుంబానికి ఒక్కరికి రూ 5 లక్షల పరిహారం మంజూరు చేయాలని తెలిపారు. పంటనష్టం ఎకరాకు రూ 25వేలు, పంటనష్టపోయిన రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని, పత్తిని గ్రేడింగ్ నిబంధనలు సడలించి ఎఫ్సీఐ, సీసీఐ కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. మద్దతు ధర 6 పంటలకే కాకుండా మరో 17 పంటలకు ప్రకటించాలని డిమాండ్ చేశారు.