Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యానికి బానిసై డబ్బులివ్వలేదని హత్య
నవ తెలంగాణ- కొల్లాపూర్
తాగుడుకు బానిసైన కొడుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే అతి దారుణంగా చంపాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్ట చంద్రమ్మ (65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. చిన్నకొడుకు పుట్ట రాముడు తల్లితోపాటే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాముడు డబ్బుల కోసం తల్లితో రోజూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులివ్వాలని గొడవపడ్డాడు. చివరికి తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో విచక్షణా రహితంగా ఆమె గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలించారు. అతన్ని పట్టుకొని విచారించగా, నరసింహాపురం బెట్ల రహదారి చెట్ల మధ్యలో వేసిన చంద్రమ్మ తలని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకట రెడ్డి, ఎస్ఐ మురళి గౌడ్ తెలిపారు. తాగుడుకి బానిసైన రాముడ్ని ఇద్దరూ భార్యలు పదేండ్ల కిందటే వదిలేసినట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు.