Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 3 వరకు నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2020 పరీక్షల ఫలితా లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి బుధవారం ఓయూలో విడుదల చేశారు. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన ఈపరీక్షలో 30,600మంది పాల్గొనగా 29,861 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు (https://edcet.tsche.ac.in ) ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని పాల్గొన్నారు.