Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే తెలంగాణలో ఉద్యమం ప్రారంభిస్తాం :చేగుంట రోడ్ షోలో మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-చేగుంట / దుబ్బాకరూరల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మొదలయ్యాయనీ, త్వరలోనే రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభిస్తామనీ మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు మద్దతుధర కూడా రాకుండా పోతుందని విమ ర్శించారు. చేగుంట, దుబ్బాకరూరల్, మిరుదొడ్డి మండలాల్లో బుధవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్రావు ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే కాలిపోయే మోటార్లు, బీజేపీకి ఓటేస్తే బాయికాడ మీటర్లు అంటూ ఎద్దేవా చేశారు. బాయికాడ మీటర్లు పెడితే రూ.2500 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిందన్నారు. ప్రతి మోటారుకు మీటరు బిగించి లెక్కతీయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి మీటర్లు బిగించేదిలేదని స్పష్టం చేశారన్నారు. 24 గంటల ఉచిత కరెంటును రైతులందరికీ అందిస్తామన్నారు. వ్యవసాయ బిల్లులతో మార్కెట్లు ప్రయివేటుపరమై రైతులకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. బిల్లులపై దేశం మొత్తం అట్టుడుకుతుందని తెలిపారు. త్వరలోనే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అన్యాయం జరగనీయమన్నారు. మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రవీణ్ కుమార్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.