Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వం...ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై దమనకాండ ప్రయోగించడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖండించారు. కార్పొరేట్లకు రుణమాఫీ చేయడం కాదు...కర్షకులకు చేయాలని సూచించారు. పంజాబ్, హర్యానా రైతులు తమ బాధలను కేంద్ర ప్రభుత్వానికి చెబుకుందామని ఢిల్లీకిి పోతే వారిని అడ్డగించి, ఫిరంగులు, భాష్పవాయివుగోళాలు ప్రయోగించడం దారుణమని పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను ఢిల్లీకి రానీయకుండా ఇనుప కంచె వేసి, తీవ్రమైన చలి ఉన్న సమయంలో రైతులపై చన్నీళ్ళు కొట్టడం భారత జాతికే అవమానకరమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతాంగం సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. కొత్త చట్టాలతో మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రైతాంగ ఆందోళనకు మంత్రి సంపూర్ణ మద్దతు తెలిపారు.