Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవో అధ్యక్షులు ఎం రాజేందర్
- సీఎంతో త్వరలో సమావేశం : మంత్రి శ్రీనివాస్గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు అండగా ఉంటామని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం టీఎన్జీవో హైదరాబాద్ నగర శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ఉద్యోగులు కేసీఆర్తో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. అనేక సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారని చెప్పారు. మిగిలిన సమస్యలనూ అతి త్వరలోనే ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించుకుందామని అన్నారు. టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ గత పాలకులు పట్టించుకోని అనేక సమస్యలను తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, కోశాధికారి ఆర్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీరామ్, కార్యదర్శి కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.