Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 753 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 2,68,418 మంది వైరస్ బారిన పడగా, అందులో 2,56,330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 10,637 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా మరణాల సంఖ్య 1451కు చేరింది. మరో 695 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 41,991 మందిని పరీక్షిస్తే అందులో 1.79 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 1,44,388 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.
జీహెచ్ఎంసీలో వందకు పైగా....
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో కేవలం జీహెచ్ఎంసీలో మాత్రం 133 కేసులు నమోదు కాగా మిగతా జిల్లాల్లో కేసులు వందలోపునే ఉన్నాయి. నారాయణపేటలో జీరో కేసులు నమోదయ్యాయి.