Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిద్దరూ గొప్ప విప్లవ స్నేహితులు
- ఆర్థిక అంశాలపై మార్క్స్, ఆర్థికేతర అంశాలపై ఏంగెల్స్ కృషి: ఏంగెల్స్ ద్విశత జయంతి సభలో బివి రాఘవులు
- కమ్యూనిస్టు సిద్ధాంతమే మన ఆయుధం : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఇద్దరి ఉమ్మడి కృషితోనే 'మార్క్సిజం' అభివృద్ధి చెందిందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. స్నేహంలో వారిద్దరినీ ఎలా విడదీయలేమో, మార్క్సిజంలోనూ అంతేనని అన్నారు. ఏంగెల్స్ ద్విశత జయంతి సభ సందర్భంగా 'సోషలిస్టు సిద్ధాంతవేత్త, శ్రామికవర్గ విప్లవ సారధి ఫ్రెడరిక్ ఏంగెల్స్', 'ఏంగెల్స్ జీవితం-కృషి' నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్, ప్రజాశక్తి బుక హౌజ్ ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సీతారాం, వెంకట్రావ్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ జనరల్ మేనేజర్ కె చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 'మార్క్సిజం అభివృద్ధిలో ఏంగెల్స్ పాత్ర' అనే అంశంపై రాఘవులు ప్రధాన వక్తగా మాట్లాడారు. ఏంగెల్స్ సమసమాజ స్థాపన కోసం జీవించారని చెప్పారు. ఆశయ సాధన కోసం తప్ప వేరే అంశాలపై ఆయన జీవితంలో దృష్టి కేంద్రీకరించలేదని వివరించారు. మార్క్స్, ఏంగెల్స్ కలిసి కార్మికులు, ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి కలిసి ర చనలు చేశారని గుర్తు చేశారు. వారిద్దరినీ ప్రాణస్నేహితులు మాత్రమే కాదనీ, విప్లవ స్నేహితులని అభిప్రాయపడ్డారు. ఆశయ సాధన కోసం స్నేహం చేశారని అన్నారు. ఏంగెల్స్ తోడ్పాటు, ఆలోచనా శక్తి లేకుండా కమ్యూనిస్టు సిద్ధాంతం వచ్చేది కాదన్నారు. పెట్టుబడి గ్రంధాన్ని మార్క్స్ రచించారు కాబట్టి మార్క్సిజం వచ్చిందని వివరించారు. అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు. 2008 నుంచి కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక మాంద్యం, ఇప్పుడు కరోనా వైర స్తో అది మరింత తీవ్రమైందని అన్నారు. దీంతో మార్క్స్, ఏంగెల్స్ రచనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడి ందని వివరించారు. ఏంగెల్స్ హైస్కూల్ వరకే చదువు కున్నారని చెప్పారు. అయినా ప్రపంచగతిని మార్చే శక్తిసామర్థ్యాలున్నాయని అన్నారు. పరిపూర్ణమైన శాస్త్రీయ రాజకీయ దృక్పథాన్ని ఏర్పర్చుకున్నారని వివరించారు. పెట్టుబడి గ్రంథం మొదటి సంపుటిని మార్క్స్ రాసి ప్రచురిస్తే, రెండు, మూడో సంపటాలను ఏంగెల్స్ సహ కారంతోనే ప్రచురితమయ్యాయని చెప్పారు. ఆయన జీవి తంలో ప్రతిక్షణం, ప్రతిపైసా సమసమాజం కోసం ఖర్చు చేశారని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అంశాలపై మార్క్స్ కేద్రీకరిస్తే, ఆర్థికేతర అంశాలపై ఏంగెల్స్ కేంద్రీకరించి పని చేశారని గుర్తు చేశారు. కార్మికుల స్థితిగతులు, కమ్యూ నిస్టు ప్రణాళిక, రాజ్యం, పుట్టుక, స్త్రీ సమస్యలు, స్త్రీ వి ముక్తి, వ్యక్తిగత ఆస్తి వంటి అంశాలపై అనేక రచనలు చేశా రని వివరించారు. కుటుంబ స్వరూపం, వ్యక్తిగత ఆస్తి వార సు లకు చెందే పద్ధతి మారకుండా స్త్రీ విముక్తి సాధ్యం కాదని ఏంగెల్స్ ఎప్పుడో చెప్పారని అన్నారు. ప్రస్తుత కాలంలో మా ర్క్స్తోపాటు ఏంగెల్స్ రచనలను అ ధ్యయనం చేయాలని కోరారు. ఆయన ఆదర్శాలను ముం దుకు తీసుకుపోవాలని సూచించారు.
మార్క్సిజం పిడి సిద్ధాంతం కాదు : తమ్మినేని
మార్క్సిస్టు తత్వవేత్త, కమ్యూనిస్టు మేధావి ఏంగెల్స్ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతమే తమ ఆయుధమని చెప్పారు. రాబోయే కాలంలో మార్పు కోసం ఉపయోగపడేది మార్క్సిజం, లెనినిజం అని వివరించారు. ఈ సిద్ధాంతాన్ని ఆయుధంగా తీసుకుని శ్రామికవర్గ ప్రజల సమస్యలపై అధ్యయనం చేయాలని కోరారు. మార్క్స్, ఏంగెల్స్ జయంతి, వర్ధంతి సభలు దండేసి దండం పెట్టుకోవడం కోసం కాకుండా లోపాలను అధిగమించేందుకు ఉపయోగపడాలని సూచించారు. మార్క్సిజం, లెనినిజం పట్ల ఆకర్షణ లేదనీ, నిరాదరణకు గురవుతున్నదని చెప్పారు. అయితే మార్క్సిజం పిడి సిద్ధాంతం కాదన్నారు. నిరంతరం పదును పెట్టి సమ స్యలకు అన్వయించి ప్రజల్లో ఆ భావజాలం పెంపొ ందించాల్సిన అవసరముందన్నారు. సృజనాత్మకంగా మార్కిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. శాస్త్రీయమైన దృక్పథాన్ని చూపడంలో ఏంగెల్స్ గొప్ప పాత్ర పోషించారని గుర్తు చేశారు. బీజేపీ ప్రమాదం, మతతత్వ, ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవాలని అన్నారు. ఆర్థిక అంశాలకే పరిమితం కావొద్దనీ, సామాజిక, రాజకీయ, సాంసృతిక అం శాలపై పనిచేయాలని సూచించారు. భావజాలంపై ఆధిక్యత సాధించాలన్నారు. మార్క్సిజం తప్ప మరో మార్గం లేదని ప్రపంచమంతా గ్రహించే రోజులొస్తాయని ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీ సుకెళ్లాలని కోరారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) ఏపీ రా ష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ మార్క్సిస్టు సిద్ధాంతంలో ఏంగెల్స్ గొప్ప పాత్ర నిర్వహించారని చెప్పారు. మార్క్సిజం ఔనత్యాన్ని పెంచడంలో ఏంగెల్స్ రచనలు తోడ్పడ్డాయని వివరించారు. ఏంగెల్స్ ఆదర్శాలకు అందరం పునరంకితం కావాలని కోరారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారనీ, వారిని సమీ కరించి చైతన్యం పెంచడానికి వారి రచనలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.